గురుకుల పరీక్షలు వాయిదా.

Published : Jul 20, 2017, 09:04 PM ISTUpdated : Mar 24, 2018, 12:17 PM IST
గురుకుల పరీక్షలు వాయిదా.

సారాంశం

తెలంగాణ నిరుద్యోగులకు మరోసారి నిరాశ. గురుకుల ఉపాధ్యాయ పరీక్షలు వాయిదా. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం నుండి జరిగే పరీక్షలు వాయిదా.

తెలంగాణ నిరుద్యోగులకు మరోసారి నిరాశ  ఎదురైంది. జూలై 21వ తేదీ నుండి జరగాల్సిన గురుకుల పరీక్షలు చివరి నిమిషంలో తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది.  ఈ నెల 18 నుండి పిజీటి పరీక్షలు జరిగాయి. నేటి నుండి 20 టీజిటి  పరీక్షలు మొదలయ్యాయి.  కానీ జూలై 21 నుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. చివరి నిమిషంలో హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. 

 గురుకుల టిజిటి, పిజిటి పోస్టుల విషయంలో లింగ వివక్ష కొనసాగుతోందని, నిరుద్యోగులు న్యాయ పోరాటం కూడా చేశారు. మహిళకు అధిక శాతం ప్రాధాన్యత ఇస్తున్నారని, కొంత మంది  నిరుద్యోగులు డిమాండ్ చేశారు. దీనిపైన హైకోర్టు కూడా వెళ్లారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించిన టీెెఎస్పిఎసీ, శుక్రవారం నుండి జరిగే పరీక్షలను హైకోర్టు  ఆదేశాల మేరకు వాయిదా వేసింది. ఈ నెల 22,23,24,25,26,27,28,29 తేదీలలో జరగాల్సిన గురుకుల పరీక్షలు వాయిదా పడ్డాయి.  తిరిగి గురుకుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం ప్రకటించలేదు.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే