టీఎస్‌పీఎస్సీ : గ్రూప్ 2 పరీక్షలు వాయిదా .. కొత్త డేట్స్ ఇవే

Siva Kodati |  
Published : Oct 10, 2023, 09:25 PM ISTUpdated : Oct 10, 2023, 09:34 PM IST
టీఎస్‌పీఎస్సీ : గ్రూప్ 2 పరీక్షలు వాయిదా .. కొత్త డేట్స్ ఇవే

సారాంశం

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. నవంబర్ 2, 3 బదులుగా జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమీషన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావపేశంలో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. 

ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి వుంది. అయితే ఆ సమయంలో వరుసగా ఇతర పోటీ పరీక్షలు వుండటంతో అభ్యర్ధులు ఆందోళన నిర్వహించారు. దీంతో దిగొచ్చిన టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. అనంతరం నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు గాను తెలంగాణ వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu