కోర్టులు, పోలీసులు కూడ స్త్రీలపై అకృత్యాలను ఆపడం లేదు: దిశ త్రిసభ్య కమిటీ సభ్యుడు కార్తికేయన్

Published : Dec 22, 2019, 01:40 PM ISTUpdated : Dec 22, 2019, 01:50 PM IST
కోర్టులు, పోలీసులు కూడ స్త్రీలపై అకృత్యాలను ఆపడం లేదు: దిశ త్రిసభ్య కమిటీ సభ్యుడు కార్తికేయన్

సారాంశం

మహిళలపై దాడులు, దౌర్జన్యాలను పోలీసులు, కోర్టులు కూడ అడ్డుకోలేకపోతున్నాయని  సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ తెలిపారు. 

మహాబూబ్‌నగర్: స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను పోలీసులు, కోర్టులు కూడ కాపాడలేకపోతున్నాయని మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ అభిప్రాయపడ్డారు.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సీబీఐ మాజీ  అధికారి కార్తికేయన్ సభ్యుడిగా ఉన్నారు. 
 

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ముగ్గురితో సుప్రీం కమిటీ

ఉమ్మడి మహాబూబ్‌నగర్  జిల్లాలోని కడ్తాల్‌కు సమీపంలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద  ధ్యాన మహా చక్రంలో కార్తికేయన్ పాల్గొన్నారు. ధ్యాన మహా చక్రంలో  పాల్గొన్న సీబీఐ మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also read:దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ డాక్టర్లు

భారత్‌లో  స్త్రీలను దేవతలుగా పూజిస్తామని అలాంటి దేశంలో స్త్రీలపై అత్యాచారాలు, దాడులు చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఈ తరహా ఘటనలు సిగ్గుచేటని ఆయన చెప్పారు.

Also read:దిశ కేసు నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ నెల 6వ తేదీన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.  ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై  సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్  వీఎస్ సిర్పుర్కార్ ఛైర్మెన్‌గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా రేఖ, మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు చెప్పింది.

Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్

ఈ కమిటీ  ఆరు మాసాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ కమిటీ ఇంకా కూడ విచారణకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించలేదు. ఈ కేసు విచారణ కోసం ఈ నెలాఖరులో కమిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే

అయితే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కూడ కార్తికేయన్ ఆదివారం నాడు కూడ కడ్తాల్ లో ఉంటారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu