
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా...?
కరుడగట్టిన టీడీపీ వ్యతిరేకులు కూడా ఇప్పటి వరకు ఈ ఆరోపణలు చేయలేదు. అయితే రేవంత్ రెడ్డితో
చాలా ఏళ్లుగా టీడీపీలో కలసి పనిచేసేన ప్రముఖ నేతే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆయన మరెవరో కాదు ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు.
ఓటుకు కోట్లు కేసులో అప్రూవర్ గా మారుతానంటూ చంద్రబాబునాయుడును రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ ప్రచారం చేయడంలో రేవంత్ ఆరితేరారని విమర్శించారు.
ఇటీవల ఎర్రబెల్లి మళ్లీ టీడీపీ లోకి జంప్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన ఆ వార్తలు అన్నీ నిరాదారణమని మీడియాకు విడుదల చేసిన ఓ లేఖలో స్పష్టం చేశారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను కలసిన మాట వాస్తవమేనని అయితే తమ మధ్య స్నేహం రాజకీయాలకు అతీతమైందని వివరణ ఇచ్చారు.
అయితే , రేవంత్ మీద కక్ష తీర్చుకోడానికే ఎర్రబెల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా... లేక నిజంగా చంద్రబాబును రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.