
అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వాళ్లు మరేం భయపడకండి. మీరు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హామీ ఇస్తున్నారు.
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాల వల్ల ఆ దేశానికి వెళ్లిన వారికి ఇక్కట్లు తప్పేలా లేవు.
అయితే ట్రంప్ పెట్టిన ఆంక్షల అమలు అంత ఈజీ కాదని, అక్కడి సెనెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయంపై మాట్లాడతానని చెప్పారు.
ఈ రోజు ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ నిర్ణయాలపై తెలంగాణ ఎన్ ఆర్ ఐ లు పడే ఇబ్బందులుపై చర్చ వచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి పై విధంగా స్పందించారు.