హైదరాబాద్‌కు ఈసీ బృందం.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారితో భేటీ, ఏం జరుగుతోంది..?

Siva Kodati |  
Published : Apr 15, 2023, 06:13 PM IST
హైదరాబాద్‌కు ఈసీ బృందం.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారితో భేటీ, ఏం జరుగుతోంది..?

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో ఈసీ బృందం భేటీ అయ్యింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనిలో భాగంగా శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ముగ్గురు సభ్యుల ఈసీ బృందం వచ్చింది.  ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో ఈసీ బృందం భేటీ అయ్యింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో చేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని ఈసీ బృందం సూచించింది.  ఆర్‌వోలు మే 1 నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని.. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్ షాపు నిర్వహించాలని సీఈసీ అధికారులు సూచించారు. అలాగే పోలింగ్ శాతం పెంచే కార్యక్రమాలపై సీఈసీ సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ