ఫెమా నిబంధనల ఉల్లంఘన.. హైదరాబాద్‌లోని ఆల్ఫాజియో ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ

By Siva KodatiFirst Published Nov 23, 2022, 3:54 PM IST
Highlights

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ హైదరాబాద్‌కు చెందిన ఆల్ఫాజియో కంపెనీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది

హైదరాబాద్‌లోని ఆల్ఫాజియో ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈ మేరకు ఆ కంపెనీ ఆస్తులను బుధవారం ఈడీ అటాచ్ చేసింది. ఆయిల్ కంపెనీల్లో ఆల్ఫాజియో భూగర్భ సర్వేలు చేస్తోంది. ఈ సంస్థ భూసర్వే నిర్వహణ కోసం విదేశాల నుంచి భారీగా సామాగ్రిని దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసుకున్న సామాగ్రికి హవాలా రూపంలో చెల్లింపులు చేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆల్ఫాజియోకు చెందిన రూ.16 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. 

click me!