ఈ వరంగల్ యువతి వరకట్న దాహానికి బలి

Published : Sep 13, 2017, 02:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ఈ వరంగల్ యువతి వరకట్న దాహానికి బలి

సారాంశం

పెళ్లయిన 9 నెలలకే యువతి ఆత్మహత్య వరకట్న వేధింపులే కారణమన్న పేరెంట్స్

కట్నదాహం మరో యువతిని బలి తీసుకుంది. పెళ్లయిన 9 నెలలకే ఆ యువతి వల్లకాటికి చేరిందంటే కట్న దాహమే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం, మల్లక్ పల్లి గ్రామానికి చెందిన దేవురుప్పుల అనుష (22) ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

అయితే ఈ అనూషకు పెళ్లయి 9 నెలలే అయిందని, అంతలోనే అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు.

PREV
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu