అందుకే కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది : రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

Published : Nov 14, 2023, 06:01 AM IST
అందుకే కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది : రేవంత్  కీల‌క వ్యాఖ్య‌లు

సారాంశం

TPCC chief Revanth Reddy: 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల‌ను నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు పదేళ్లు పాలించినా పంట రుణాల మాఫీ, 2బీహెచ్ కే ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల ప్రధాన హామీలన్నీ నెరవేరలేదు.. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు హామీలను అమలు చేస్తుందన్నారు.  

Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందనీ, డిసెంబర్ 3న భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డితో పాటు తాను పోటీ చేయనున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సభల్లో రేవంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పార్టీ ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దౌల్తాబాద్, మద్దూరు, గుండుమాల్, కోస్గిలో నిర్వహించిన సభల్లో రేవంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. "2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. దాదాపు పదేళ్లు పాలించినా పంట రుణాల మాఫీ, 2బీహెచ్ కే ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల ప్రధాన హామీలన్నీ నెరవేరలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు హామీలను అమలు చేస్తుంది" అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించిన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసి దాని స్థానంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని విమ‌ర్శించారు. 2009 నుంచి 2018 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొడంగల్ లో అన్ని అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు రామారావు, హరీశ్ రావు హామీ ఇవ్వడంతో కొడంగల్ ప్రజలు తనను ఓడించి బీఆర్ ఎస్ అభ్యర్థిని ఎన్నుకున్నారన్నారు.

కానీ ఐదేళ్లు గడిచినా కొడంగల్ మాత్రం అలాగే ఉండడంతో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులు ఒక్కటి కూడా లేవన్నారు. ఇప్పుడు అవే అబద్ధపు హామీలతో మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ కు కొడంగల్ ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రాష్ట్రాన్ని దోచుకోకుండా అడ్డుగా ఉన్న అడ్డంకిని తొలగించేందుకు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు కొండగల్‌కు వస్తున్నారని అన్నారు. కొడంగల్ ప్రజానీకాన్ని అప్ర‌మ‌త్తం కావాల‌ని అన్నారు. కొడంగల్ భవిష్యత్తును నాశనం చేసే చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యుల ఉచ్చులో పడొద్దని కొడంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu