శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం.. అసలేం జరిగిందంటే..

Published : Jan 28, 2023, 11:31 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం.. అసలేం జరిగిందంటే..

సారాంశం

హైదరాబాద్‌‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్‌లో గందరగోళం చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్‌లో గందరగోళం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. అయితే  ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే‌పై ల్యాండ్ అవుతూనే.. పైలెట్ ఒక్కసారిగా విమానాన్ని టేకాఫ్ చేశారు. దీంతో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత ఐదు నిమిషాలకు పైలెట్.. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రన్‌వేపై విజిబిలిటీ సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ