‘కోస్గీ‘ అల్లరిమూకల అరెస్టు

Published : Dec 15, 2016, 01:11 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
‘కోస్గీ‘ అల్లరిమూకల అరెస్టు

సారాంశం

24 గంటల్లోనే పట్టుకున్న మహబూబ్ నగర్ పోలీసులు ఓ ప్రార్ధనాలయంలో అసాంఘికచర్యలకు పాల్పడిన నిందితులు

మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో  రెండు వర్గాల మధ్య ఘర్షణ  సృష్టించేందుకు జరిగిన ఒక కుట్రను పోలీసులు చాకచక్యంగా, శరవేగంగా భగ్నం చేశారు.  ఈ దశ్చర్యకు పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకుని 24 గంటలలో సామరస్యం పునరుద్ధరించారు.

 

 కోస్గీలో బుధవారం ఓ ప్రార్థనాలయం వద్ద చోటు చేసుకున్న అసాంఘిక చర్యతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు.

 

అయితే,  ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేసేందుకు ఒకఅల్లరి మూక కుట్ర చేసిందన్న సమాచారం అందగానే ఎస్ పి రెమారాజేశ్వరి, అమె సిబ్బంది వెంటనే కోస్గి చేరుకుని  ఈ దుశ్చర్య సమాచారం అవేశకావేశాలు సృష్టించకుడండా చర్యలు తీసుకున్నారు. అదనపు బలగాలను రప్పించి పరిస్తితి చే జారకుండా కట్టుదిట్టం  చేశారు.  ఇరువర్గాలను ప్రజలను సంప్రదించి, వారి సహాయంతో  ఉద్రిక్తత ఏర్పడకుండా చూశారు.

 

ఈ అసాంఘిక చర్యకు పాల్పడిన దోషులను జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

 

కొత్త గణేష్, గూడెల్లి గణేష్, కొదుముల సురేశ్ లను నిందితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి గురువారం తెలిపారు.

 

ఓ ప్రార్ధనాలయంలో అసాంఘిక చర్యకు పాల్పడినట్లు నిందితులు స్వయంగా ఒప్పుకున్నట్లు ఆమె వెల్లడించారు.

 

కాగా, నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ బుధవారమే ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. కోస్గీలో పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు.

ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు డీఎస్పీ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్ల‌క‌ల్లోలం ఖాయం
Hyderabad: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. యువతికి హెచ్ఐవీ ఇంజెక్ష‌న్ ఇచ్చిన యువకుడు