తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

CM KCR: కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కామారెడ్డి

Rajesh K | Published : Oct 3, 2023 9:21 AM

Telangana Assembly Elections 2023: కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అంతగా వర్కవుట్ కావడం లేదు. ఏ ముహూర్తంలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారో తెలీదు కానీ అప్పటినుండి సీఎం కేసీఆర్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి.  

CM KCR: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ప్రకటనను ఏ ముహూర్తంలో చేశారో తెలియదు గానీ అంతగా వర్కవుట్ కావడం లేదు. ఈ ప్రకటన చేసిన నాటి నుంచి నానా సమస్యలు కమ్ముకొస్తున్నాయి. పలు సామాజిక  వర్గాల నుండి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

>> నిరసన గళం విప్పిన లబాన్ లంబాడీలు 

కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో లబాన్ లంబాడీలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని వివిధ ప్రాంతాలలో లబాన్, మధుర, కాయితి, జట్టు లంబాడీలు అని కూడా పిలుస్తారు. మాములుగా లంబాడీలు అంటే ఎస్టీ జాబితాలో ఉంటారు అనుకుంటాం. కానీ వీరు మాత్రం అందుకు భిన్నంగా  ఓబీసీ జాబితాలో ఉండడం  గమనార్హం. తొలుత వీరు కూడా ఎస్టీ జాబితాలోనే ఉండి రిజర్వేషన్ సదుపాయాలు పొందిన వారే.. కానీ 1986లో వీరిని ఎస్టీల నుండి బీసీ జాబితాలో మార్చారు. దీంతో వారికి అందవలసిన రిజర్వేషన్లు అందడం లేదు. రానున్న రాయితీ రావడం లేదు. దీంతో తమను మళ్లీ ఎస్టీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వీరి సమస్యను పరిష్కరిస్తానని దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ హామీ ఇచ్చినా.. ఆచరణకు నోచుకోలేదు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత లబాన్ లంబాడీలు తమ సమస్యను పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ ఆశ్రయించగా.. వారి డిమాండ్ ను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. వారి స్థితిగతులను పరిశీలించిన చెల్లప్ప కమిషన్ కూడా వారిని ఎస్టీ జాబితాలోకి మార్చాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ, ఆ సిఫారసులు ఆచరణకు నోచుకోలేదు. అలాగే.. రు దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ పూడి వ్యవసాయం చేసుకుంటున్న ఎస్టీ జాబితాలో లేకపోవడంతో వారికి పోడు పట్టాలు అందడం లేదు.దీంతో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లబాన్ లంబాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి 1016 నామినేషన్ దాఖాలు చేస్తామని ప్రకటించారు. 

>> తెరపైకి వచ్చిన రెడ్డి కార్పొరేషన్

కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ పోటీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజు నుండే రెడ్డి కార్పొరేషన్ డిమాండ్ మరోసారి తెరమీదికి వచ్చింది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తో రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి వేదికగా ఆందోళన చేపట్టాలని సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రస్తుత నియోజకవర్గమైన గజ్వేల్ నుండి కామారెడ్డి వరకు పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు వారి కార్యచరణ కూడా వెల్లడించారు. ఈ నెల 29 నుండి నవంబర్ 5 వరకు తమ పాదయాత్ర సాగుతుందని, నవంబర్ 5 న కామారెడ్డి వేదికదా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రెడ్డి ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. 

>> పోరుబాట పట్టిన ముదిరాజులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులు తమ నిరసనగలాన్ని విప్పారు. రానున్న ఎన్నికలలో తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే  తమను బిసి-డి నుండి బిసి-ఎ జాబితాలోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తమ డిమాండ్లను పరిష్కరించాలని గత నెల 25న కామారెడ్డి జిల్లా వేదికగా ముదిరాజులు ధర్మ యుద్ధం ర్యాలీ పేరిట నిరసన ప్రదేశంలో చేసిన విషయం తెలిసిందే.

Read more Articles on
click me!