సీఎం కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సెక్రటేరియట్ దగ్గర ట్విన్ టవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్

Published : May 30, 2023, 11:20 AM IST
సీఎం కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సెక్రటేరియట్ దగ్గర ట్విన్ టవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్

సారాంశం

Hyderabad: తెలంగాణ సచివాలయం సమీపంలో విభాగాధిపతులకు ట్విన్ టవర్స్ ప్లాన్ చేస్తున్న సీఎం కేసీఆర్.. ఈ నిర్మాణాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆయా శాఖ‌ల అధికారులు సచివాలయంతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా సెక్రటేరియట్ కు సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్థలంలో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు.  

Telangana CM K. Chandrasekhar Rao: సచివాలయం సమీపంలో విభాగాధిపతులకు ట్విన్ టవర్స్ ప్లాన్ చేస్తున్న సీఎం కేసీఆర్.. ఈ నిర్మాణాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆయా శాఖ‌ల అధికారులు సచివాలయంతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా సెక్రటేరియట్ కు సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్థలంలో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు.

వివ‌రాల్లోకెళ్తే.. కొత్త తెలంగాణ సచివాలయం ప్రారంభమైన నెల రోజులకే అన్ని శాఖల అధిపతుల కోసం సచివాలయం సమీపంలో ట్విన్ టవర్లు నిర్మించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. కొత్త సచివాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో అన్ని ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ వోడీ) కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ అధికారులు సచివాలయంతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా సచివాలయానికి సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్థలంలో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు.

అన్ని రంగాల ప్రభుత్వ శాఖల హెచ్ వోడీల కింద పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. కొత్త సచివాలయం సమీపంలో విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్థలాన్ని ఖరారు చేసిన తర్వాత ట్విన్ టవర్ల నిర్మాణం చేపడతామని సీఎం తెలిపారు. దేశం గర్వించేలా డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారనీ, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వర్తిస్తున్నారని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన వర్గాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర కులాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. వారికి దశలవారీగా సాయం అందిస్తామని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పడంతో, వీలైనంత త్వరగా విధివిధానాలను ఖరారు చేసి జూన్ 2న ప్రారంభమయ్యే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో నిర్వహించే సంక్షేమ దినోత్సవం రోజున పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు.

21 రోజుల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్ల పురోగతిపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం సచివాలయం సమీపంలోని హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అమరవీరుల స్థూపం ముందు తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu