సీఎం కేసీఆర్ కంటతడి

First Published Apr 29, 2017, 2:34 PM IST
Highlights

విద్యాసాగర్ రావు అందించిన సేవలకు గుర్తుగా రాష్రంలో ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు.  

తెలంగాణ నీటి పారుదల రంగం నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు మృతి సీఎం కేసీఆర్ కు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ రోజు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించే సమయంలో  కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు.

 

హబ్సిగూడ లోని విద్యాసాగర్ రావు ఇంటికి సతీ సమేతంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానభూతి తెలిపారు.అనంతరం ప్రగతి భవన్ లో విద్యాసాగర్ రావుతో తనకున్న  అనుబంధాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచుకున్నారు.

 

విద్యాసాగర్ రావు అందించిన సేవలకు గుర్తుగా రాష్రంలో ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు.  

click me!