పౌర సరఫరా శాఖ ఉద్యోగులపై వేటు

First Published Nov 18, 2016, 2:51 PM IST
Highlights
  • ఇద్దరు జిల్లా అధికారుల సస్పెన్సన్

పౌరసరఫరాల సంస్థలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది.విధుల్లో అలసత్వం వహించినందుకుగాను సంగారెడ్డి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలుమార్లు శాఖాపరమైన సమీక్షలు నిర్వహించిన సివి ఆనంద్ సివిల్ సప్లై ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందిగా సూచించారు. ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

click me!