చిలకలగూడ ఎస్సై సస్పెన్షన్, లంచం డిమాండ్ చేసినందుకు.....

Published : Jul 06, 2018, 06:15 PM IST
చిలకలగూడ ఎస్సై సస్పెన్షన్,  లంచం డిమాండ్ చేసినందుకు.....

సారాంశం

రికవరీ వాహనాన్ని బాధితుడికి తిరిగివ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సై సస్పెండ్ కు గురయ్యాడు. అవినీతి నిరోదక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ఎస్సై పై సస్పెన్షన్ వేటు వేశారు.

రికవరీ వాహనాన్ని బాధితుడికి తిరిగివ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సై సస్పెండ్ కు గురయ్యాడు. అవినీతి నిరోదక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ఎస్సై పై సస్పెన్షన్ వేటు వేశారు.

వివరాలలోకి వెళితే...సికింద్రాబాద్ నామాలగుండుకు చెందిన సంతోష్ కుమార్ వామనం చోరీకి గురయ్యింది. దీంతో అతడు మే 17న  చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బైక్ కోసం గాలించారు. అయితే ఎట్టకేలకు 20 రోజుల తర్వాత కొంపల్లి ప్రాంతంలో ఈ వాహనాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు బైక్ దొరికిందని సంతోష్ కు సమాచారం అందించారు. దీంతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితుడికి బైక్ మాత్రం అప్పగించలేదు. తమకు డబ్బులు ఇస్తేనే వాహనాన్ని తిరిగి ఇస్తామని ఎస్సై వెంకటాద్రి తో పాటు రాజేష్ అనే కానిస్టేబుల్ డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సంతోష్ ఎసిబిని ఆశ్రయించాడు.

బాధితుడి నుండి ఫిర్యాదు స్వీకరించిన అవినీతి నిరోదక శాఖ అధికారులు ఎస్సై వెంకటాద్రి, కానిస్టేబుల్ రాజేష్ లకు నోటీసులు జారీ చేశారు. అనంతరం ఈ కేసుపై విచారణ జరిపి హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ కు నివేదిక ఇచ్చారు. దీంతో ఎస్సై వెంకటాద్రిని సస్పెండ్ చేస్తూ నగర సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు