భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు: బాబు

By narsimha lodeFirst Published Dec 3, 2018, 3:30 PM IST
Highlights

భావోద్వేగాలను రెచ్చగొట్టి  రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.


హైదరాబాద్: భావోద్వేగాలను రెచ్చగొట్టి  రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. సోమవారం నాడు హైద్రాబాద్‌లోని రామ్‌నగర్‌లో నిర్వహించిన  రోడ్‌షో లో బాబు ప్రసంగించారు.

యువకులను ప్రోత్సహించేందుకు తాను ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు తమ వంతు ప్రయత్నస్తున్నట్టు చెప్పారు.మాయమాటలు చెప్పి రెచ్చగొట్టాలని చూస్తే కుదరదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్దికి అన్ని విధాలుగా సహకరిస్తానని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. అభివృద్ధిఫలాలు తెలంగాణ ప్రజలకు చేరడం లేదని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ వ్యూహనికి కూటమి ప్రతి వ్యూహం ఇదే

బీజేపీకే సాధ్యం కాలేదు,కేసీఆర్ ఎంత: బాబు సంచలనం

కేసీఆర్, కేటీఆర్‌ల బెదిరింపులకు భయపడను: చంద్రబాబు

 

 

click me!