అక్రమ సంబంధం వ్యవహారంలో సిఐ పై కేసు

Published : Jan 22, 2018, 06:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అక్రమ సంబంధం వ్యవహారంలో సిఐ పై కేసు

సారాంశం

కేపిహెచ్ బి పోలీసులకు ఫిర్యాదు చేసిన సునీతారెడ్డి భర్త సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు ఐపిసి 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు

తెలంగాణలోని ఎసిబి అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున రెడ్డిపై కేసు ఫైల్ అయింది.

తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన భార్య సునీతా రెడ్డిని లొంగదీసుకున్నాడు అంటూ పోలీసులకు సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

సునీతారెడ్డి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత సునీతారెడ్డి ఇంటికి కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సునీతారెడ్డి భర్త, తల్లి, అత్త కలిసి మల్లిఖార్జునరెడ్డికి చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.

ఈ నేపథ్యంలో సునీతారెడ్డి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపిహెచ్ బి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kavitha Pressmeet: కేసీఆర్‌ సిట్ విచారణ పై స్పందించిన కవిత| Asianet News Telugu
Union Budget లో వైజాగ్ ప్రస్తావనే లేదు.. అయినా ఈ నగరానికి మహర్దశ, ఎలాగో తెలుసా..?