గజం భూమీ పోకపోతే, ఆఫీసర్ల మీద వేటెందుకు ?

Published : Jun 14, 2017, 02:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
గజం భూమీ పోకపోతే, ఆఫీసర్ల మీద  వేటెందుకు ?

సారాంశం

 పుప్పాలగూడలో గజం భూమి కూడా పోలేదని సిఎం  కెసిఆర్ మాట్లాడడం సిగ్గుచేటు. నిజంగా భూమి పోకపోతే  72 మంది అధికారులను ఎందుకు బదిలీ చేశారు?  తక్షణమే సిబిఐ  విచారణ జరిపించాలి.

భూముల కుంభకోణంలో తెలంగాణ సిఎం వైఖరిని ఖండించారు నాగం. భూముల వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కెకె కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వానిదే అని నాగం స్పష్టం చేశారు. తక్షణమే కెకెపై చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు కెకె మీద కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

 

మియాపూర్, ఇబ్రహింపట్నం  భూముల కుంభకోణంపై ఇప్పటికే టిడిపి  భారీస్థాయిలో ఆందోళన చేపట్టింది. గవర్నర్ నర్సింహ్మన్ కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతికి  కూడా  ఫిర్యాదు చేయడం కోసం టిడిపి కసరత్తు చేస్తోంది. కలెక్టరేట్ల ను  ముట్టడించింది.

 

తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. వివాదాస్పద భూముల విషయంలో పోరుబాట  పట్టింది. దీంతో  బిజెపి  సైతం రంగంలోకి దిగింది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం  జనార్థన్  రెడ్డి  సిఎం కు లేఖ రాయంతో ప్రత్యక్ష కార్యాచరణకు బిజిపి దిగనుందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu