ఆయన పేరు కల్వకుంట్ల ఖాన్ సాబ్ : విద్యాసాగర్‌ రావుపై ఎంపీ ధర్మపురి సెటైర్లు

By Siva KodatiFirst Published Jan 23, 2021, 8:12 PM IST
Highlights

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై విరుచుకుపడ్డారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. హిందూ సమాజంలో టీఆర్ఎస్ నాయకులు చెడపుట్టుక పుట్టార‌ని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై విరుచుకుపడ్డారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. హిందూ సమాజంలో టీఆర్ఎస్ నాయకులు చెడపుట్టుక పుట్టార‌ని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ లో ఉన్నోళ్లంతా హిందూ వ్యతిరేక చెంచాలకు వత్తాసు పలుకుతున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు. శ్రీరాముడు ఎక్కడ పుట్టారో తెలియని డూప్లికేట్ కల్వకుంట్ల ఎమ్మెల్యే అయోధ్య రామాలయం నిర్మాణంపై మాట్లాడుతాడా అని మండిప‌డ్డారు .

Also Read:రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

ఒరిజినల్ కల్వకుంట్ల రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దని చెప్పినా.. వినే స్థితిలో హిందువులు లేరని, నువ్వొక‌ డూప్లికేట్ కల్వకుంట్లవి.. నీ మాటలు.. నీ ఫ్యామిలీ మెంబర్లే వినరని ధర్మపురి ధ్వజమెత్తారు.

ఆర్టికల్ 370 బిల్లుపై పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేసిందని.. రామాలయ నిర్మాణంపై ఓటింగ్ చేస్తే టీఆర్ఎస్ రామాలయం నిర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేసేవారని ఆయ‌న జోస్యం చెప్పారు.

ఈ రాష్ట్ర సీఎం ఫామ్ హౌజ్‌లో 24 గంటలు మత్తులో ఉంటే.. ప్రధాని నరేంద్రమోడీ రోజుకు 20 గంటలపాటు ప్రజలకు సేవ చేస్తున్నార‌ని అర్వింద్ ప్రశంసించారు. హిందువులు తమ సంస్కృతి, సంస్కారాలను కాపాడుకోవాలని, గులాబీ పార్టీ ప్రస్తుతం గ్రీన్ పార్టీ అయ్యింద‌ని అన్నారు.

కొత్త సీఎం వస్తున్నాడని మంత్రి పదవి పొందేందుకు డూప్లికేట్ కల్వకుంట్ల రామాలయంపై వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను ఈ రోజు నుంచి కల్వకుంట్ల ఖాన్ సాబ్‌గా నామకరణం చేసినట్లు బీజేపీ నాయకులు తీర్మానం చేశారు.

మీ ఒరిజినల్ కల్వకుంట్ల కు నరేంద్ర మోడీకి మర్యాద ఇవ్వడం నేర్చుకుంటే తాము అప్పుడు మీ సీఎం కు మర్యాద ఇవ్వాలా వద్దా ఆలోచిస్తానని వెల్లడించారు. ఎంఐఎం పార్టీ బీహార్లో పోటీ చేస్తే ఐదు సీట్లు వచ్చాయని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని అర్వింద్ పిలుపునిచ్చారు. 

click me!