ఈ నెల 15 లేదా 16న బీజేపీ అభ్యర్థుల జాబితా: 35 మందికి జాబితాలో చోటు దక్కే చాన్స్

ఈ నెల 15 లేదా 16 తేదీల్లో అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.35 మందితో అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది.
 

Google News Follow Us

హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16 తేదీల్లో  బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.35 మందితో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.  గత నెల  4 నుండి  10వ తేదీ వరకు  ఆశావాహుల నుండి  బీజేపీ నాయకత్వం ధరఖాస్తులను  ఆహ్వానించింది. సుమారు  ఆరు వేలకు  పైగా   ధరఖాస్తులు  అందాయి.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా  66 మంది ధరఖాస్తు చేసుకున్నారు.

also read:వచ్చే వారంలో బీజేపీ అభ్యర్థుల జాబితా: 30 మందికి చోటు దక్కే అవకాశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో  అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.   అదే సమయంలో  క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై  కూడ  బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. ఈ నెల  మొదటి వారం నుండి  బీజేపీ అగ్రనేతలు  రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నెల  1, 3 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రాష్ట్రంలో పర్యటించారు.ఈ నెల  1న మహబూబ్ నగర్, ఈ నెల  3న  నిజామాబాద్ లో నిర్వహించిన సభలో మోడీ ప్రసంగించారు. ఈ నెల  6న  హైద్రాబాద్ లో జరిగిన  బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

also read:ఆరువేలకు పైగా ధరఖాస్తులు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు భారీగా ధరఖాస్తులు

ఈ నెల  10వ తేదీన  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 10న ఆదిలాబాద్ లో జరిగే  సభలో  అమిత్ షా పాల్గొంటారు.మరో వైపు  ఈ నెలాఖరులో  మరోసారి  ప్రధాని నరేంద్ర మోడీ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. 

Read more Articles on