భారత్ ను నిరుద్యోగ దేశంగా మార్చిన బీజేపీ.. కాషాయ పార్టీపై కేటీఆర్ ఘాటు విమ‌ర్శ‌లు

Published : Nov 01, 2023, 05:55 AM IST
భారత్ ను నిరుద్యోగ దేశంగా మార్చిన బీజేపీ.. కాషాయ పార్టీపై కేటీఆర్ ఘాటు విమ‌ర్శ‌లు

సారాంశం

Hyderabad: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత్ ను నిరుద్యోగ దేశంగా మార్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అసమర్థ కేంద్ర మంత్రిగా నిరూపించుకుని తెలంగాణ, ప్రజల అభివృద్ధికి కృషి చేయ‌ని జీ.కిషన్ రెడ్డికి ఉద్యోగ నియామకాలపై చర్చించే నైతిక హక్కు లేదని కేటీఆర్ అన్నారు.  

BRS working president and Minister KTR: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ  స‌ర్కారును టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కాషాయ పార్టీ  భారత్ ను నిరుద్యోగ దేశంగా మార్చిందని ఆరోపించారు. అసమర్థ కేంద్ర మంత్రిగా నిరూపించుకుని తెలంగాణ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి  చేయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డికి ఉద్యోగ నియామకాలపై చర్చించే నైతిక హక్కు లేదన్నారు. కిషన్ రెడ్డి ఆరోపణలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే నిరుద్యోగం పెరిగిందని గుర్తు చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమై దేశ యువతను మోసం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భ‌ర్తీ చేసినన్ని ఉద్యోగ ఖాళీలను భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. ఇప్పటికే 1,60,000 ప్రభుత్వ పోస్టులను విజయవంతంగా భర్తీ చేయగా, మరో 70,000 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపిన కేటీఆర్.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. గత పదేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు, వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 16 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) వంటి ప్రాజెక్టులను కేంద్రం రద్దు చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇతర నిబంధనలను కేంద్రం రద్దు చేసినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో, ఐటీ, తయారీ, ఫార్మా తదితర కీలక రంగాల్లో 24 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించడంలో విజయం సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

"గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం శాఖల వారీగా చేసిన రిక్రూట్‌మెంట్‌లపై కిషన్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయగలరా? అలాగే బీజేపీలో తన సహచరుడు బండి సంజయ్ భవిష్యత్తుపై ప్రభావం చూపే లక్ష్యంతో ప్రశ్నపత్రం లీకేజీలకు కారణమని కూడా యువ‌త గుర్తుంచుకోవాలి" అని కేటీఆర్ అన్నారు. "తెలంగాణలో పెద్దఎత్తున ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది కూడా కేంద్రం కాదా? దేశంలోనే తెలంగాణ ఉద్యోగాలకు ‘అక్షయపాత్ర’గా మారిన వాస్తవం.. కనీసం ఇప్పుడైనా కిషన్ రెడ్డి చేయాలి. యువత జీవితాలతో, భవిష్యత్తుతో ఆడుకోవడం మానేయండి" అని హిత‌వు ప‌లికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకుని ఉంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేవి కానీ అవి నెరవేరలేదన్నారు. ఈ విషయంలో గిరిజన యువతను మోసం చేసిన బీజేపీకి గుణపాఠం చెబుతామన్నారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే