
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జోరు పెంచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల సమరానికి శంఖారావం పూరించిన బీజేపీ అంతే వేగంతో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. తొలిదశలో 38 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది.
శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
రాష్ట్ర నాయకత్వం జాబితాపై కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. గెలిచే అవకాశాలపై నేతలకు దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేసే అంశంపై చర్చించింది. అనంతరం 38 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదిస్తూ ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం కల్పించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన బాబూమోహన్ ఆందోల్ నుంచి బరిలోకి దిగనున్నారు. అదే విధంగా ఈ తొలివిడత జాబితాలో ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు.
తెలంగాణతోపాటు చత్తీష్ ఘడ్, మిజోరాం రాష్ట్రాల తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. చత్తీష్ఘడ్ రాష్ట్రంలో తొలివిడత జాబితాలో భాగంగా 77 మంది అభ్యర్థులను ప్రకటించింది. అలాగే మిజోరాంలో 13 మంది అభ్యర్థులను ప్రకటించింది.
ముషీరాబాద్ - డాక్టర్ కె. లక్ష్మణ్
అంబర్ పేట-జి.కిషన్ రెడ్డి
గోషామహల్-టి. రాజాసింగ్
ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
మాల్కాజిగిరి -ఎన్. రామచందర్ రావు
ఖైరతాబాద్ - చింతల రాంచంద్రారెడ్డి
ఎల్బీనగర్ - పేరాల శేఖర్ రావు
కార్వాన్ - టి.అమర్ సింగ్
మేడ్చెల్ - పి.మోహన్ రెడ్డి
మునుగోడు - డా.జి.మనోహర్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ -కె.ఆనంద్ రెడ్డి
దుబ్బాక - ఎం.రఘునందన్ రావు
ముథోల్ -డా.పి. రమాదేవి
భద్రాచలం - కుంజా సత్యవతి
భూపాలపల్లి -డా.సిహెచ్.కీర్తిరెడ్డి
పరకాల -డా.పి విజయ చంద్రారెడ్డి
కామారెడ్డి -కె. వెంకటరమణారెడ్డి
బోథ్ - మడవి రాజు
సత్తుపల్లి -ఎన్.రామలింగేశ్వర రావు
పాలేరు - కొండపల్లి శ్రీధర్ రెడ్డి
సూర్యాపేట -సంకినేని వెంకటేశ్వరరావు
ఆదిలాబాద్ - పాయల్ శంకర్
ధర్మపురి -కె. అంజయ్య
మానకొండూర్ -జి. నాగరాజు
కోరుట్ల - డా.జి.వెంకట్
బెల్లంపల్లి -కె. ఇమాజీ
తాండూర్ - పటేల్ రవిశంకర్
నారాయణపేట్ -కె.ఆర్.పాండురెడ్డి
షాద్ నగర్ -ఎన్. శ్రీవర్థన్ రెడ్డి
మక్తల్ - బి.కొండయ్య
పినపాక డా. సంతోష్ కుమార్ చంద్
ఆర్మూర్ -పి. వినయ్ కుమార్ రెడ్డి
గద్వాల్-జి. వెంకటాద్రి రెడ్డి
అచ్చంపేట - మల్లేశ్వర్ మేడిపూర్
కల్వకుర్తి-టి.ఆచారి
కరీంనగర్ -బి.సంజయ్
పెద్దపల్లి -జి. రామకృష్ణారెడ్డి
ఆందోల్ - బాబూమోహన్