ఈటెల బీజేపీలో చేరగానే.. కేసీఆర్ భయంతో రోడ్డెక్కాడు... బండి సంజయ్..

Published : Jun 21, 2021, 02:05 PM IST
ఈటెల బీజేపీలో చేరగానే.. కేసీఆర్ భయంతో రోడ్డెక్కాడు... బండి సంజయ్..

సారాంశం

తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర అని బీజేపీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దన్నారు.

తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర అని బీజేపీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దన్నారు.

తెలంగాణ సాధన- అభివృద్ధి మాత్రమే ఈటెల కోరిక అని, ఈటెల బీజేపీ లో చేరగానే సీఎం కు భయం పుట్టిందని ఎద్దేవా చేశారు. ఈటెల బయటకు రాగానే ముఖ్యమంత్రి రోడ్డెక్కారు.

సీఎం టూర్లు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నేతలను- కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీఆరెస్ లో ఉంటే నిజమైన ఉద్యమకారులు- లేదంటే ఉద్యమ ద్రోహులు అంటారా? అంటూ విరుచుకుపడ్డారు.

సీఎం కేసీఆర్ తనకు లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న నేతలు ఎవరు ఉన్నారో చూసుకోవాలన్నారు. బ్లాక్ మెయిల్ చేసేవాళ్లు,  కమిషన్లు తీసుకునే వాళ్లు టీఆరెస్ లో చాలామంది ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమానికి టి- బీజేపీ పురుడు పోస్తదని చెప్పుకొచ్చారు.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?