Nehru Zoo Park: జూ పార్క్‌లో ఏనుగు బీభత్సం విషాదం.. ఆహారం పెడుతుండగా మావటిపై..  

Published : Oct 07, 2023, 11:56 PM IST
Nehru Zoo Park: జూ పార్క్‌లో ఏనుగు బీభత్సం విషాదం.. ఆహారం పెడుతుండగా మావటిపై..  

సారాంశం

Nehru Zoo Park: హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి చెందాడు.

Nehru Zoo Park: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షకుడు శనివారం మృతి చెందాడు. సమాచారం ప్రకారం.. ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో  5-6 మంది జంతు సంరక్షకులు (మావటిలు) విధుల్లో ఉంటారు. అయితే.. శనివారం జూ పార్క్‌‌లో 60 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నారు. దీంతో కొంత మంది సిబ్బంది ఆ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో షాబాజ్‌ (28) ఒక్కరే విధుల్లో ఉన్నారు.

షాబాజ్‌‌ ఆహారం అందించేందుకు వెళ్లగా.. విజయ్ అనే ఏనుగు అతడిపైకి దూసుకొచ్చి, తొండంతో అమాంతం ఎత్తి నేలకేసి కొట్టింది. అనంతరం.. కాలితో తొక్కింది.  ఈ సంఘటన మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది తీవ్రంగా గాయపడిన షాబాజ్‌ను ఎన్‌క్లోజర్ నుండి బయటకు తీసి అపోలో DRDO ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై జూ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. షాబాజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. జూపార్క్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు