ఏసీబీకి చిక్కిన జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్‌.... రూ.20 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు, రాత్రి కొనసాగనున్న సోదాలు

Siva Kodati |  
Published : Jun 30, 2022, 08:08 PM IST
ఏసీబీకి చిక్కిన జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్‌.... రూ.20 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు, రాత్రి కొనసాగనున్న సోదాలు

సారాంశం

హైదరాబాద్ లో ఏసీబీ వలకు అవినీతి తిమంగలం చిక్కింది. జల్ పల్లి మున్సిపల్ కమీషనర్ గా పనిచేస్తున్న జీపీ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు దాదాపు రూ.20 కోట్ల వరకు అక్రమ ఆస్తులను గుర్తించింది. 

హైదరాబాద్ జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్ జీపీ కుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్ల వరకు అక్రమ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఉదయం నుంచి జీపీ కుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. రాత్రి కూడా తనిఖీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీపీ కుమార్ లాకర్లు తెరిచిన అధికారులు .. భారీగా నగలు, నగదు , ఆస్తిపత్రాలను గుర్తించారు.

ఇకపోతే.. Kurnool  మున్సిపల్ కార్పోరేషన్ లో గురువారం నాడు ACB అధికారులు Raids చేశారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఈ Surendra ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమృత్ స్కీం రూ. 1.52 కోట్ల బిల్లు మంజూరు చేసేందుకు ఎస్ఈ సురేంద్ర లంచం డిమాండ్ చేసినట్టుగా  కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు.ఈ విషయమై ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన కాంట్రాక్టర్ బండారం బట్టబయలు చేశాడు. కాంట్రాక్టర్ నుండి రూ. 15 లక్షలు తీసుకుంటున్న సమయంలో  ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా 
ఆయనను పట్టుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!