మద్యం తాగుదామని తీసుకెళ్లి యువకుడి దారుణ హత్య.. హైదరాబాద్ లో ఘటన..

By Sairam IndurFirst Published Mar 27, 2024, 2:25 PM IST
Highlights

ఓ స్నేహితుడు మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ యువకుడు మరో యువకుడిని ఘోరంగా హత్య చేశాడు. తరువాత డెడ్ బాడీతో కూడా పాశవికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. పలు మీడియా సంస్థ కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

గోవాలో నేపాల్ మేయర్ కూతురు మిస్సింగ్.. అసలేమైందంటే ?

హైదరాబాద్ లోని బాలానగర్ కు చెందిన 20 ఏళ్ల యువకుడు, మహ్మద్ సయ్యద్ సమీర్ స్నేహితులు. అయితే మద్యం తాగుదామని మహ్మద్.. ప్రణీత్ ను తీసుకెళ్లాడు. మత్తులోకి జారుకున్న తరువాత ప్రణీత్ ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సైకోలాగా ప్రవర్తించి.. కడుపులోని పేగులను బయటకు తీశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే మిగితా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

click me!