కరీంనగర్ జిల్లాలో 8 నెమళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి.
జిల్లాలోని ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
గ్రామ శివారులోని రాజిరెడ్డి అనే రైతు తన పొలంలో పంట కోసం విష గుళికలు చల్లారు.
ఆ గులికలు తినడం వల్లనే ఈ నెమళ్లు చనిపోయాయని స్థానికులు అంటున్నారు.
ఒకేసారి 8 నెమళ్లు మృత్యువాత పడడం చర్చనీయాంశమైంది.