కరీంనగర్ లో 8 నెమళ్లు మృతి

First Published Mar 3, 2018, 2:18 PM IST
Highlights
  • గులికలు తిని మరణించిన 8 నెమళ్లు
  • కరీంనగర్ జిల్లాలో సంఘటన

కరీంనగర్ జిల్లాలో 8 నెమళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి.

జిల్లాలోని ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

గ్రామ శివారులోని రాజిరెడ్డి అనే రైతు తన పొలంలో పంట కోసం విష గుళికలు చల్లారు.

ఆ గులికలు తినడం వల్లనే ఈ నెమళ్లు చనిపోయాయని స్థానికులు అంటున్నారు.

ఒకేసారి 8 నెమళ్లు మృత్యువాత పడడం చర్చనీయాంశమైంది.

click me!