పాడు పని చేసిన ముసలోనికి ... దేహశుద్ధి

Published : Sep 12, 2017, 03:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
పాడు పని చేసిన ముసలోనికి ... దేహశుద్ధి

సారాంశం

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం 60 ఏళ్ల ముసలోడి నిర్వాకం దేహశుద్ధి చేసిన స్థానికులు అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు

ఆతడు 60 ఏండ్ల ముసలోడు. కానీ అభం శుభం తెలియని చిన్నారి పాలిట రాక్షసుడు అయ్యాడు. ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిపై ఆ 60 ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన కుషాయిగూడలో జరిగింది.

తన ఇంటి పక్కన ఉండే చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన యాదయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని చాక్లెట్లు ఆశ చూపాడా ముసలోడు. అయినా భయాందోళనకు గురైన ఆ చిన్నారి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.

దీంతో యాదయ్యను పట్టుకుని స్థానికులు దేహశుద్ది చేశారు. పొట్టు పొట్టుగా కొట్టిన తర్వాత ఆ ముసలోన్ని పోలీసులకు అప్పగించారు. చిన్నారి ని అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu