రూ.5 భోజనం..150 కేంద్రాలలో..

Published : Mar 16, 2017, 05:47 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
రూ.5 భోజనం..150 కేంద్రాలలో..

సారాంశం

పథకం పేరును అన్నపూర్ణగా మార్చినట్లు ప్రకటించిన కేటీఆర్

 

జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన రూ.5 భోజనం జంటనగరాల పరిధిలో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా కూలీలు, పేదలకు ఈ భోజన పథకం అన్నపూర్ణ అని చెప్పకతప్పదు.

 

ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 109 చోట్ల ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో వరంగల్ లో కూడా ఏర్పాటు చేస్తామని కడియం శ్రీహరి ప్రకటించారు.

 

ఈ పథకం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఈ రోజు మాట్లాడుతూ..ఈ భోజన కేంద్రాలను 109 నుంచి 150 కి పెంచుతామని ప్రకటించారు.

 

అలాగే రూ. 5 భోజన పథకాన్ని ఇకపై అన్నపూర్ణ భోజన కేంద్రంగా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు.

 

అయిదు రూపాయల భోజనం నాణ్యంగా ఉన్నదని ఇప్పటికే ప్రతిపక్ష నేత జానారెడ్డితో సహా పలువురు కితాబిచ్చారని గుర్తు చేశారు.

 

ఆస్పత్రులు, లేబర్ అడ్డాల్లో ఈ కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భోజన కేంద్రాల వద్ద త్రాగునీరు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్