తెలంగాణలో 20 వేలు దాటిన కరోనా: ఒక్కరోజే 1,892 కేసులు... హైదరాబాద్‌లోనే 1,658 కేసులు

By Siva KodatiFirst Published Jul 3, 2020, 11:17 PM IST
Highlights

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కి చేరింది

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కి చేరింది.

వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 1,658 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 8 మంది వైరస్ కారణంగా మరణించారు. వీటితో కలిపి తెలంగాణలో కోవిడ్ మృతుల సంఖ్య 283కి చేరుకుంది. తెలంగాణలో ఈరోజు 1,126 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 10,195కు చేరింది.

హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి 56, మేడ్చల్ 44, సంగారెడ్డి 20, మహబూబ్‌‌నగర్‌లలో 12, సిరిసిల్ల 6, కామారెడ్డి 6, నల్గొండ 13, వరంగల్ (రూరల్) 41, వనపర్లి 5, కొత్తగూడెం 4, మహబూబాబాద్ 7, మెదక్ 3, నిజామాబాద్ 3, వికారాబాద్, నాగర్‌కర్నూలు, వరంగల్ అర్బన్, జగిత్యాల, ములుగులలో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదయ్యాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం ప్రగతిభవన్ లో పనిచేసే ఐదుగురికి కరోనావైరస్ సోకింది. దాంతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం చోటు చేసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. 

ఐదుగురు ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి కెసీఆర్ గజ్వెల్ లోని తన నివాసగృగహంలో ఉంటున్నారు. అయితే, ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా సోకిన విషయంపై ప్రభుత్వం ఏ విధమైన అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఈ విషయంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గత వారం రోజుల్లో దాదాపు గా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణ లో ప్రగతి భవన్‌ ను శానిటైజేషన్ చేస్తున్నారు. 

click me!