
తెలంగాణలో (Telangana) గడచిన 24 గంటల్లో 22,902 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా, 103 మందికి పాజిటివ్గా తేలినట్లు (corona cases) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,74,555కి చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,66,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,575 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,981కి (corona deaths in telangana) పెరిగింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 49, జగిత్యాల 0, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 6, ఖమ్మం 3, మహబూబ్నగర్ 0, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 1, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 6, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 2, నారాయణపేట 2, నిర్మల్ 0, నిజామాబాద్ 0, పెద్దపల్లి 0, సిరిసిల్ల 0, రంగారెడ్డి 13, సిద్దిపేట 2, సంగారెడ్డి 2, సూర్యాపేట 0, వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 3, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.