నీలా సన్నాసిని కాదు, కుట్రలు నాకు చేతకాదు: చంద్రబాబుపై కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Apr 8, 2019, 7:06 PM IST
Highlights

లక్షలాది మంది సాక్షిగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ ఎంపీలు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము సహకరిస్తామని ప్రకటించారు.

వికారాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. వికారాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ తాము ఏనాడు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడలేదన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులతో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎలాంటి గొడవలు లేవన్నారు. 

గత కొద్ది రోజులుగా తనను చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని గుర్తు చేశారు. లక్షలాది మంది సాక్షిగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ ఎంపీలు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. 

అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము సహకరిస్తామని ప్రకటించారు. సముద్రంలోకి నీరు వృధాగా పోతుందని దాన్ని ఆంధ్రప్రదేశ్ ఒడిసిపట్టుకుంటే తాము ఎందుకు అడ్డుకుంటామన్నారు. 

చంద్రబాబు నాయుడులా తాను సన్నాసిని కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబు లాంటి పిడికెడు మంది కిరికిరి నేతల వల్లే సమస్య అన్నారు. చంద్రబాబుకు తెలివిలేదని తనకు ఉందన్నారు. 

click me!