శార్దూల్ కు అచ్చిరాని ఆరంగేట్రం: గాయపడి వెనక్కి

Published : Oct 12, 2018, 10:48 AM IST
శార్దూల్ కు అచ్చిరాని ఆరంగేట్రం: గాయపడి వెనక్కి

సారాంశం

టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.

హైదరాబాద్: శార్దూల్ ఠాకూర్ కు ఆరంగేట్రం అచ్చి రానట్లే ఉంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శార్దూల్ ఠాకూర్ టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. అయితే, అంతలోనే గాయపడి మైదానం నుంచి వైదొలిగాడు. 

ఈ మ్యాచులో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.

అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఆ నొప్పితో విలవిలలాడుతుంటే చూడలేక కెప్టెన్ కోహ్లీ, ఫిజియో మైదానం వీడాల్సిందిగా సూచించారు. దాంతో అతను మైదానం వీడాడు.

శూర్దూల్ 3.4 ఓవర్లు ఓవర్లు వేశాడు. చివరి రెండు బంతులు అశ్విన్ వేసి ఓవర్ పూర్తి చేశాడు. 

PREV
click me!

Recommended Stories

టీ20 ప్రపంచకప్ ముందే పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ టోర్నీకి దూరం.!
ఒక్కడి కోసం.. ఆ ఇద్దరిని టెస్టుల నుంచి తప్పించారా..? ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్న