శార్దూల్ కు అచ్చిరాని ఆరంగేట్రం: గాయపడి వెనక్కి

Published : Oct 12, 2018, 10:48 AM IST
శార్దూల్ కు అచ్చిరాని ఆరంగేట్రం: గాయపడి వెనక్కి

సారాంశం

టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.

హైదరాబాద్: శార్దూల్ ఠాకూర్ కు ఆరంగేట్రం అచ్చి రానట్లే ఉంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శార్దూల్ ఠాకూర్ టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. అయితే, అంతలోనే గాయపడి మైదానం నుంచి వైదొలిగాడు. 

ఈ మ్యాచులో టాస్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చింది. బౌలింగుకు దిగిన శార్డూల్ ఠాకూర్ దాదాపు 14 బంతులు వేశాడో లేదో గాయపడ్డాడు.

అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఆ నొప్పితో విలవిలలాడుతుంటే చూడలేక కెప్టెన్ కోహ్లీ, ఫిజియో మైదానం వీడాల్సిందిగా సూచించారు. దాంతో అతను మైదానం వీడాడు.

శూర్దూల్ 3.4 ఓవర్లు ఓవర్లు వేశాడు. చివరి రెండు బంతులు అశ్విన్ వేసి ఓవర్ పూర్తి చేశాడు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే
Fastest T20 WC Hundreds: 33 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ఫిన్ అలెన్.. టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే