మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ తన ఆనందాన్ని వెరైటీగా వెలిబుచ్చాడు
గెలుపు ఇచ్చే కిక్ మరేది ఇవ్వలేదంటారు పెద్దలు... విజయం దక్కిన ఆనందంలో ఒళ్లు తెలియని మైకం వచ్చేస్తుంది.. ఆ సమయంలో ఏం చేస్తామో మనకే తెలియదు.. అదే మనల్ని నలుగురి ముందు తలదించుకునేటట్లు చేయొచ్చు. ఇప్పుడు అచ్చం అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ తన ఆనందాన్ని వెరైటీగా వెలిబుచ్చాడు.. బ్యాట్ను నేల మీదకు జార విడిచి సంబరాలు జరుపుకున్నాడు. దీనిపై నెటిజన్లు ‘బ్యాక్ డ్రాప్ ’ అనే పేరు పెట్టి ట్రోల్ చేశారు. దీంతో తను చేసిన పనికి పశ్చాత్తపడ్డాడు రూట్.. మరోసారి సంబరాలు చేసేటప్పుడు బ్యాట్ను జారవిడవని.. ఎప్పుడూ ఇలా చేయను క్షమించాలని కోరాడు..