షారూక్ కి  కోర్టు నోటీసులు

Published : Aug 02, 2017, 01:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
షారూక్ కి  కోర్టు నోటీసులు

సారాంశం

షేవింగ్ క్రీమ్ కి ప్రచారకర్తగా ఉన్న షారూక్ షారూక్ పై కేసు వేసిన భోపాల్ కి చెందిన రాజ్ కుమార్

 

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కి కోర్టు నోటీసులు జారీ చేసింది. షారుక్‌ఖాన్‌ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ షేవింగ్‌ క్రీమ్‌ వాడటం వల్ల తనకు చర్మంపై దద్దుర్లు వచ్చాయని  ఓ వ్యక్తి కేసు పెట్టాడు. కేసువివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు చెందిన రాజ్‌కుమార్‌ పాండే అనే వ్యక్తి స్థానిక మార్కెట్‌ నుంచి ఓ షేవింగ్‌ క్రీమ్‌ కొనుగోలు చేశాడు.

ఆ షేవింగ్‌ క్రీమ్‌కి షారుక్‌ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే రాజ్‌కుమార్‌ ఈ క్రీం వాడటంతో అతని ముఖంపై దద్దుర్లు వచ్చాయట. దాంతో షారుక్‌ఖాన్‌ తన ప్రకటనతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక వినియోగదారుల న్యాయస్థానంలో కేసు పెట్టాడు. ఈ కేసు విషయమై సదరు న్యాయస్థానం షారుక్‌ఖాన్‌తో సహా షేవింగ్‌ క్రీం ఉత్పత్తి చేసే సంస్థ యాజమాన్యానికి, కొనుగోలు చేసిన దుకాణాదారుడికి, మధ్యప్రదేశ్‌ ఎఫ్‌డీడీ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ డిపార్ట్‌మెంట్‌) డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu