స్వర్ణ దేవాలయంగా మారుతున్నశబరిమళై అయ్యప్ప సన్నిధి

Published : Jun 25, 2017, 05:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
స్వర్ణ దేవాలయంగా మారుతున్నశబరిమళై అయ్యప్ప సన్నిధి

సారాంశం

శబరిమళైలో  2000 సంవత్సరం వరకు చెక్కలతో తయారు చేయబడిన గోడలతో నిర్మించబడ్డ గర్భాలయం, తత్వమసి ఆలయానికి ఒక దాత సాయంతో బంగారు తాపడం చేపించారు. ఇప్పుడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ధ్వజస్తంబాన్ని తొలగించి అదే స్థానంలో కేరళ రాష్ట్రంలోని కోన్ని అనే పేరు గల అడవినుండి టేక్ వుడ్ కలప చెట్టును నరికి ధ్వజస్తంబంగా మలచి దానికి సుమారు 130 కిలోలకు పైగా బంగారు రేకులను అమర్చి ప్రతిష్టించారు

 శబరిమల శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం ఇప్పుడు సంపూర్ణ స్వర్ణ దేవాలయం గా మారబోతోంది. ఇప్పటికే గర్భాలయం, తత్వమసి బంగారు రేకులతో కప్పబడితే.. ఇప్పుడు ధ్వజస్తంభం కూడా స్వర్ణాలంకృతమవుతున్నది.ఎంతో మంది దాతలు ముందుకు వచ్చినా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫీనిక్స్ ఇన్‌ఫ్రా సంస్థకే అదృష్టం దక్కింది. ఈ రోజు  బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం జరిగింది.


 2000 సంవత్సరం వరకు చెక్కలతో తయారు చేయబడిన గోడలతో నిర్మించబడ్డ గర్భాలయం, తత్వమసి ఆలయానికి ఒక దాత సాయంతో బంగారు తాపడం చేపించారు. ఇప్పుడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ధ్వజస్తంబాన్ని తొలగించి అదే స్థానంలో కేరళ రాష్ట్రంలోని కోన్ని అనే పేరు గల అడవినుండి టేక్ వుడ్ కలప చెట్టును నరికి ధ్వజస్తంబంగా మలచి దానికి సుమారు 130 కిలోలకు పైగా బంగారు రేకులను అమర్చి ప్రతిష్టించారు(ఫోటోలు కింద). 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu