నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం.. మహిళపై అత్యాచారం

Published : Mar 02, 2018, 03:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం.. మహిళపై అత్యాచారం

సారాంశం

ఒంటరి మహిళలే లక్షంగా దాడులు  చేసిన సైకో

నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు.గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నాయీ బ్రాహ్మణవీధిలో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహిళ అరుపులు విన్న స్థానికులు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. పారిపోయాడు.  అనంతరం ఓ వృద్ధురాలిపై దాడి చేయడంతో.. ఆమె తీవ్రగాయాలపాలైంది.  వృద్ధురాలిని, అత్యాచారానికి గురైన మహిళ.. ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సైకో కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !