రెడ్ మీ నోట్5 ప్రియులకు.. శుభవార్త

First Published Mar 2, 2018, 1:03 PM IST
Highlights
  • ఇక ఆఫ్ లైన్ లోనూ రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్5 ప్రో ఫోన్లు

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రాన్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. ఇటీవల భారత మార్కెట్లోకి రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్5 ప్రో పేరిట రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లను రెండు సార్లు ఆన్ లైన్ లో విడుదల చేయగా.. రెండు సార్లు అతి తక్కువ సమయంలో ఫోన్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో.. ఫోన్లు కొనడంలో విఫలమైన వారు చాలా మంది  నిరాశకు గురయ్యారు.కాగా.. అలాంటి వారికి కంపెనీ ఓ శుభవార్త తెలియజేసింది.

ఈ స్మార్ట్‌ ఫోన్లను ఇక మీదట ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా ముందస్తు బుకింగ్స్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే.. ముందస్తు బుకింగ్‌ చేసుకోవాలంటే అసలు ధర కంటే రూ.500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 8 నుంచి ఆఫ్‌లైన్‌లో ముందస్తు బుకింగ్స్‌ చేసుకున్న వారికి స్మార్ట్‌ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. రెడ్‌మీ ఆఫ్‌లైన్‌ రిటైల్‌ పార్టనర్స్‌ ద్వారా ఈ స్మార్ట్‌ ఫోన్లను ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు.

రెడ్‌మీ నోట్‌ 5 ధర ఆన్‌లైన్‌లో రూ.9,999(3జీబీ ర్యామ్‌/ 32జీబీ మెమరీ) ఉండగా దాని ధర ఆఫ్‌లైన్‌లో రూ.10,499గా ఉండనుంది. అదే విధంగా నోట్‌ 5 మరో వేరియంట్‌ ధర రూ.11,999(4జీబీ ర్యామ్‌/ 64జీబీ మెమరీ) ఉండగా.. ఆఫ్‌లైన్‌లో రూ.12,499 చెల్లించాల్సి ఉంటుంది.

 

click me!