నిధారి కేసులో దోషులకు ఉరిశిక్ష

Published : Jul 24, 2017, 05:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
నిధారి కేసులో దోషులకు ఉరిశిక్ష

సారాంశం

19మందిని హత్య చేశారు రేరెస్ట్  ఆఫ్ ది రేర్ కేస్ గా గుర్తింపు స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు

 

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19మందిని అతి కిరాతకంగా హత్య చేశారు. వారిని వారిలో కొందరు మహిళలు, యువతులు, మరికొందరు చిన్నారులు సైతం ఉన్నారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష ఈ రోజు దిల్లీ స్పెషల్ సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..

 

నోయిడాకు చెందిన వ్యాపారవేత్త మోనిందర్ సింగ్, అతని సర్వర్ సురిందర్ కోలిలు 2006వ సంవత్సరంలో పింకీ సర్కార్ అనే 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం యువతిని రేప్ చేసి.. హత్య చేశారు.

బయటకు వెళ్లిన పింకి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి.

పింకీతో సహా 19మందిని కూడా వీరు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతిచెందిన వారిలో యువతులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. 19మందిలో 16మంది హత్యకేసులో వీరిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. మృతులంతా దిల్లీకి సమీపంలోని నిథారి అనే ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ఈ కేసు సంచలనం సృష్టించింది.

ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ గా పరిగణించి మోనిందర్ సింగ్, సురిందర్ కోలిలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu