
విజయవాడ నగరంలోని ఒక హోటల్ తెలుగుదేశం ఎమ్మెల్యేకి ఛేదు అనుభవం ఎదురయింది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చేస్తున్న టిఫిన్ లోనే పురుగులు కనిపించాయి. బొల్లినేని రామారావు మంగళవారం ఉదయం నగరంలోని హోటల్ గ్రాండ్ మినర్వాలో టిఫిన్ చేస్తుండగా ఇది జరిగింది. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే రామారావు ఆగ్రహంతో ఆహార నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇపుడు హోటల్ లో ఆహారాలను పరీక్షిస్తున్నారు.