ట్యూషన్ కి వెళ్లివస్తున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రమాదం

Published : Feb 09, 2018, 01:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ట్యూషన్ కి వెళ్లివస్తున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రమాదం

సారాంశం

మాసబ్ ట్యాంక్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మృతి

ఇవాళ ఉదయం హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాసబ్ ట్యాంక్ ఎన్‌ఎండీసీ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు విద్యార్థులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోగా , మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

 గుడి మల్కాపూర్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతుండటంతో మాసబ్ ట్యాంక్ లోని ఓ టీచర్ వద్ద  ప్రైవేట్ ట్యూషన్ కు చేరారు. వీరు  రెగ్యులర్ గా ఉదయం సమయంలో ట్యూషన్ కు వెళ్లివస్తుంటారు. రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం ట్యూషన్ కి వెళ్లిన యువకులు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ప్రవీణ్ కుమార్ అనే  విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో విద్యార్థి మృతి చెందాడు. ఇంకో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సిసి కెమెరాల ఆదారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu