
శబరిమలలో అద్భుతం చోటు చేసుకుంది. పంపానది ఒడ్డున కొలువై ఉన్న అయప్పస్వామిని దర్శించుకునేందుకు ఆయన వాహనం స్వయంగా అక్కడికి వచ్చింది.
పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు శబరిమల దేవస్థానానికి సమీపంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ఒంటరిగా వచ్చిన ఓ పులి ( అయ్యప్పస్వామి వాహనంగా భావిస్తారు) పంపానది తీరం నుంచి శబరిమల కొండపై వెళ్తున్న దృశ్యం సీసీ టీవీ ఫుటేజ్ లో బయటపడింది.
అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు. ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో ఈ వీడియో బయటపడింది.
http://newsable.asianetnews.tv/video/looks-like-lord-ayyappa-decided-to-turn-pilgrim-at-sabarimala