(వీడియో) నడిరోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు

First Published Jun 10, 2017, 5:38 PM IST
Highlights

 ప్రజలను రక్షించాల్సిన పోలీసులే పట్టపగలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. రాజ్‌ వివార్‌ కూడలి వద్దకు ఓ వాహనంపై స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనంపై వచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని అక్కడ పనిచేస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డు హుస్సేన్‌ వారి వాహనాన్ని ఆపారు. అదే గొడవకు దారి తీసింది.

 

 ప్రజలను రక్షించాల్సిన పోలీసులే పట్టపగలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. రాజ్‌ వివార్‌ కూడలి వద్దకు ఓ వాహనంపై స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనంపై వచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని అక్కడ పనిచేస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డు హుస్సేన్‌ వారి వాహనాన్ని ఆపారు. వాహనం తాళాలు లాక్కొనేందుకు హోంగార్డు యత్నించడంతో వాహనంపై నుంచి దిగిన కానిస్టేబుళ్లు అతనిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అందరి ముందే ఇలా పోలీసులు కొట్టుకోవడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.ఎస్ ాపి రవికృష్ణ వారిరువురిని సస్సెండ్ చేశారు.

 

 

 

click me!