సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న జగన్

First Published Nov 7, 2017, 3:54 PM IST
Highlights
  • ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్
  • జగన్ కి పెరుగుతున్న మద్దతు దారులు
  • సోషల్ మీడియాలో జగన్ మానియా

వైసీపీ అధినేత జగన్ కి యువత నుంచి మద్దతు పెరుగుతోంది. జగన్.. సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ యాత్రను టార్గెట్ చేస్తూ ఓ వైపు అధికార పార్టీ నేతలు విమర్శాస్త్రాలు కురిపిస్తున్నారు. మరో వైపు ఆయనకు సోషల్ మీడియాలో మద్దతుదారులు పెరిగిపోతున్నారు.

ఎంతలా అంటే.. ప్రస్తుతం ఆయన వేంపల్లి గ్రామంలో స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ ముఖాముఖికి సంబంధించిన వీడియోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైవ్ వీడియో పేరిట వైసీపీ విభాగం ఫేస్ బుక్ లో లైవ్ లో పెట్టారు. ఆ వీడియోలను జగన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా... ఆ వీడియో వేలల్లో వీక్షించారు.

ఒకవైపు సాక్షి టీవీ చూసేవాళ్లు టీవీలో చూస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో చూసేందుకు కూడా జనాలు ఎగపడుతున్నారు. ఈ ఒక్కటి చాలు ఆయనకు మద్దతు ఏవిధంగా ఉందో. కేవలం ఇదే కాదు.. ఆయన పేరిట సోషల్ మీడియా గ్రూపులు కూడా వెల్లువెత్తుతున్నాయి. జగన్ సీఎం కావాలని కోరుతూ వారు ఆ గ్రూపులు ఏర్పాటు చేసి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

click me!