
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. Iran – Israel మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం, అలాగే United States జోక్యంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచంలో కీలకమైన సముద్ర మార్గం అయిన Strait of Hormuz ప్రాంతంలో టెన్షన్ పెరగడంతో షిప్పింగ్, అంతర్జాతీయ వ్యాపారంపై ప్రభావం పడింది. దీంతో భారత్ నుంచి మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి కావాల్సిన గుడ్లు, చికెన్ ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో సరఫరా పెరగడంతో గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి.