
భారత క్రికెట్ జట్టు లో కీలక బౌలర్ గా పేరుతెచ్చుకున్న మహ్మద్ షమీ తండ్రి టౌసిఫ్ అలీకి గెండె పోటు వచ్చింది. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
గుండెపోటు విషయం తెలిసినవెంటనే తాను బెంగళూరు నుంచి వెంటనే ఢిల్లీకి బయల్దేరానని షమీ ట్విటర్ లో పేర్కొన్నాడు. తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా వెళుతున్నట్టు తెలిసిందని కానీ తాను వేచి ఉండలేని పరిస్థితి లో ఉన్నానని చెప్పాడు.
కాగా, ఇటీవల షమీ తన భార్య ఫొటోలను ట్విటర్ లో పెట్టడం దానికి కొందరి నుంచి తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. దీనికి షమీ కూడా చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.