ఆర్టీసి చార్జీలు తగ్గించారు

Published : Jul 31, 2017, 06:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఆర్టీసి చార్జీలు తగ్గించారు

సారాంశం

విజయవాడ, వైజాగ్ సిటి బస్ సర్వీస్ చార్జీ లు తగ్గాయి

 ప్రభుత్వం చార్జీలను తగ్గించిందనే  వార్త విన్నారా... పెంచడమే తప్ప తగ్గించడం తెలియదు. అయితే, ఇపుడు ఆంధ్రప్రదేశ్ సిటి బస్ చార్జీలను తగ్గించింది.ఇది వింతగానే తోస్తుంది. ప్రస్తుతానికి విజయవాడ విశాఖ పట్టణాలకు ఇది చాలా తీపి కబురు. ఈ నగరాల పరిధిలోనడిచే  మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ  ఆర్టీసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జిని రూ.7 నుంచి 5కు తగ్గంచేసింది. ఆర్టీసి చరిత్రలో ఇలా చార్జీలు తగ్గించడం ఇదే ప్రథమం కావచ్చు.మెట్రోఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కనీస ఛార్జి రూ.8 నుంచి 5కు తగ్గించారు. ఏపీఎస్‌ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు నగరాల పరిధిలో తిరిగే ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసుల్లో కనీస ఛార్జీలు రూ.5  మాత్రమే ఉంటాయి.

 

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu