పిడుగును ఫోటో తీయడానికి ప్రయత్నించి యువకుడు మృతి

Published : Jun 07, 2018, 04:13 PM IST
పిడుగును ఫోటో తీయడానికి ప్రయత్నించి యువకుడు మృతి

సారాంశం

తమిళనాడు తిరువళ్లూరులో విషాదం

సరదాగా వర్షంలో ఫోటోలు తీసుకుంటున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాడు. అతడికి సమీపంలో పిడుగు పడటంతో దాన్ని ఫోన్ లో బంధించాలని భావించిన యువకుడు ఆ వేడికి తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

తమిళనాడులోని తిరువళ్లూరులో రమేష్ అనే యువకుడు తన స్నేహితుడి రొయ్యల ఫాం కు సరదాగా వెళ్లాడు. అయితే అదే సమయంలో వర్షం మొదలై వాతావరణం ఆహ్లాదకంగా తయారయ్యింది. దీంతో రమేష్ ఆ వర్షంలో ఫోటోలు దిగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆకాశంలో ఉరుములు, మెరుపులు మొదలవడంతో వాటిని కూడా తన మొబైల్ లో బంధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడి సమీపంలో ఓ పిడుగు పడటంతో ఒళ్లు కాలిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు.

దీన్ని గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అయితే ముఖం, ఛాతి బాగాల్లో తీవ్రంగా కాలినగాయాలవడంతో అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

 
 

 
 
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu