గుజరాత్లోని దాహోద్ జిల్లాలో అమానవీయ చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు బహిరంగంగా ఒక మహిళ దుస్తులు విప్పేసి వివస్త్రను చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను బూతులు తిడుతూ దాడి కూడా చేశారు.
గుజరాత్లోని దాహోద్ జిల్లాలో అమానవీయ చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు బహిరంగంగా ఒక మహిళ దుస్తులు విప్పేసి వివస్త్రను చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను తిడుతూ దాడి కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే అందులో బాధిత మహిళ మాజీ భర్త కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన మే 28వ తేదీన చోటుచేసుకుంది.. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు తాజాగా చర్యలు తీసుకున్నారు.
బాధిత మహిళ ఏడాదిన్నరగా తనను, తమ నలుగురు పిల్లలను విడిచిపెట్టి వేరే వ్యక్తితో కలిసి జీవిస్తుందని ఆమె మాజీ భర్త కోపం పెంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమెను, ఆమె ప్రియుడిని రాంపుర గ్రామం నుంచి కిడ్నాప్ చేశాడు. అనంతరం సుఖ్సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్గాలా గ్రామానికి వారిని తీసుకెళ్లాడు. అక్కడే మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డాడు.
‘‘ఆదివాసి కమ్యూనిటీకి చెందిన మహిళ తన భర్త, వారి నలుగురు పిల్లలతో కలిసి జీవించడం మానేసి.. మెహ్సానా జిల్లాలోని చనాస్మాలో ఒక వ్యక్తితో కలిసి నివసిస్తోంది. అక్కడ వారు రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. రాంపుర గ్రామంలో ఒక వివాహానికి హాజరు కావాలని అతడి తల్లి వారిని ఆహ్వానించింది. అలాగే బాధితురాలి విడిపోయిన భర్తను కూడా ఆమె ఆహ్వానించింది. దీంతో అతను కొంతమంది వ్యక్తులతో రాంపుర గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే బాధిత మహిళను, ఆమె ప్రేమికుడిని కిడ్నాప్ చేశాడు. అనంతరం వారిని మార్గాలా గ్రామానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను పూర్తిగా ప్రజల చూస్తుండగానే దుస్తులు విప్పి కొట్టాడు ’’ అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
ఈ ఘటనను సంబంధించిన దృశ్యాలను గ్రామానికి చెందిన ఎవరో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.